జీనో పేరడాక్స్ లూ – పూర్వపక్షం!..4
జీనో పేరడాక్స్ లూ – పూర్వపక్షం!
“చూశారా! నేను జీనో పేరడాక్సుల మాయా పద్మవ్యూహపు ముడులు సైతం విప్పగలుగుతున్నాన”నే భేషజం కోసమో, మహోజ్వలమైన, విలక్షణమైన గ్రీకు తత్వశాస్త్ర చరిత్రలో ‘కలికితురాయి’ లాంటి ‘జీనో’ వంటి మహోన్మహుడ్ని కించపరచాలనుకోవడమో ఈ వ్యాస ఉద్దేశ్యం కాదు. ఒక సామాన్యుడనైన నేను గ్రీకు తత్వశాస్త్రానికే ప్రౌఢ గాంభీర్యాన్ని అలిమి, కొత్త పుంతలు తొక్కించిన జీనో వారికి ఏ మాత్రం గానూ, మరే విధంగానూ సాటిరాను. కాకుంటే ఒక తత్వవేత్త ఒక విషయాన్ని తన తర్కం ద్వారా నిరూపణకి తీసుకువచ్చినప్పుడు, అతడు తద్వతిరేకమైన వాదనలో ఏ విషయాలు విస్మరించాడో ప్రపంచానికి తెలియచెప్పే భావప్రకటనా స్వేచ్ఛ ఈ లోకంలో ప్రతివారికి లాగానే నాకూ వుంది. ఆ ప్రయత్నంలో భాగమే ఈ వ్యాసం. దానికి తగ్గట్టుగానే ఆనాడు “విశ్వదర్శనం”లో శ్రీ నండూరి రామమోహన రావు వారు చెప్పిన మాటలు చూడండి.
“ప్రతిదీ కామన్ సెన్స్ కు అనుగుణంగా వుండాలన్న వాదం కుదరదు. జీనో వంటి పారభౌతికవాదుల సిద్ధాంతాలు కేవలం తర్కాన్ని ఆధారం చేసుకున్నట్టివి. అవి అసంబద్ధంగా వున్నవని తోస్తే వాటిని తిరిగి తర్కంతోనే పూర్వపక్షం చేయాలి. ఏమైనా చాలా శతాబ్దాల పాటు కొరుకుడు పడని జీనో పేరడాక్సుల పద్మవ్యూహాన్ని ఈ శతాబ్దంలో అభివృద్ధి అయిన నూతన గణితశాస్త్రాన్ని ఉపయోగించి ఛేదించడం సాధ్యమైందని అంటున్నారు.” (విశ్వదర్శనం, ప్రధమ ప్రచురణ పుట.60).
ఈ మాటలే ఈ వ్యాసానికి ప్రేరణ. ఏదియేమైనా, పాచ్య, పాశ్చాత్య తత్వశాస్త్రాల్ని తెలుగు ప్రజానీకానికి పరిచయం చేసి, ఆయనే స్వయంగా అన్నట్టు నా వంటి సామాన్యుల మనః కుహరాంతరాలలోనికి సైతం జొచ్చి, మా చేత మరో కొలంబస్ అమెరికా ఖండ యాత్రనూ, మరో చంద్రలోక యాత్రనూ చేయించిన శ్రీ నండూరి రామమోహన రావు వారు ఎనభై సంవత్సరాల వయసుకి దగ్గరగా విజయవాడలో నివసిస్తున్నట్టు తెలియవస్తున్నది(తప్పయితే క్షమించగలరు). వారికీ, వారి సాహిత్య సేవలకూ శిరస్సు వంచి పాదాభివందనం చేస్తూ, ఆయనకు మరిన్ని ఆయురారోగ్యాలు ప్రసాదించాలని భగవంతుడుని ప్రార్థిస్తూ, ఈ వ్యాసం ముగిస్తున్నాను.
(సమాప్తం)
“చూశారా! నేను జీనో పేరడాక్సుల మాయా పద్మవ్యూహపు ముడులు సైతం విప్పగలుగుతున్నాన”నే భేషజం కోసమో, మహోజ్వలమైన, విలక్షణమైన గ్రీకు తత్వశాస్త్ర చరిత్రలో ‘కలికితురాయి’ లాంటి ‘జీనో’ వంటి మహోన్మహుడ్ని కించపరచాలనుకోవడమో ఈ వ్యాస ఉద్దేశ్యం కాదు. ఒక సామాన్యుడనైన నేను గ్రీకు తత్వశాస్త్రానికే ప్రౌఢ గాంభీర్యాన్ని అలిమి, కొత్త పుంతలు తొక్కించిన జీనో వారికి ఏ మాత్రం గానూ, మరే విధంగానూ సాటిరాను. కాకుంటే ఒక తత్వవేత్త ఒక విషయాన్ని తన తర్కం ద్వారా నిరూపణకి తీసుకువచ్చినప్పుడు, అతడు తద్వతిరేకమైన వాదనలో ఏ విషయాలు విస్మరించాడో ప్రపంచానికి తెలియచెప్పే భావప్రకటనా స్వేచ్ఛ ఈ లోకంలో ప్రతివారికి లాగానే నాకూ వుంది. ఆ ప్రయత్నంలో భాగమే ఈ వ్యాసం. దానికి తగ్గట్టుగానే ఆనాడు “విశ్వదర్శనం”లో శ్రీ నండూరి రామమోహన రావు వారు చెప్పిన మాటలు చూడండి.
“ప్రతిదీ కామన్ సెన్స్ కు అనుగుణంగా వుండాలన్న వాదం కుదరదు. జీనో వంటి పారభౌతికవాదుల సిద్ధాంతాలు కేవలం తర్కాన్ని ఆధారం చేసుకున్నట్టివి. అవి అసంబద్ధంగా వున్నవని తోస్తే వాటిని తిరిగి తర్కంతోనే పూర్వపక్షం చేయాలి. ఏమైనా చాలా శతాబ్దాల పాటు కొరుకుడు పడని జీనో పేరడాక్సుల పద్మవ్యూహాన్ని ఈ శతాబ్దంలో అభివృద్ధి అయిన నూతన గణితశాస్త్రాన్ని ఉపయోగించి ఛేదించడం సాధ్యమైందని అంటున్నారు.” (విశ్వదర్శనం, ప్రధమ ప్రచురణ పుట.60).
ఈ మాటలే ఈ వ్యాసానికి ప్రేరణ. ఏదియేమైనా, పాచ్య, పాశ్చాత్య తత్వశాస్త్రాల్ని తెలుగు ప్రజానీకానికి పరిచయం చేసి, ఆయనే స్వయంగా అన్నట్టు నా వంటి సామాన్యుల మనః కుహరాంతరాలలోనికి సైతం జొచ్చి, మా చేత మరో కొలంబస్ అమెరికా ఖండ యాత్రనూ, మరో చంద్రలోక యాత్రనూ చేయించిన శ్రీ నండూరి రామమోహన రావు వారు ఎనభై సంవత్సరాల వయసుకి దగ్గరగా విజయవాడలో నివసిస్తున్నట్టు తెలియవస్తున్నది(తప్పయితే క్షమించగలరు). వారికీ, వారి సాహిత్య సేవలకూ శిరస్సు వంచి పాదాభివందనం చేస్తూ, ఆయనకు మరిన్ని ఆయురారోగ్యాలు ప్రసాదించాలని భగవంతుడుని ప్రార్థిస్తూ, ఈ వ్యాసం ముగిస్తున్నాను.
(సమాప్తం)










